Monday, April 29, 2024

అభిమానులకు మెగాస్టార్ పిలుపు

- Advertisement -
- Advertisement -

chiranjeevi

 

కరోనా లాక్ డౌన్ వల్ల ధీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్న పేషెంట్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రక్తం అవసరం పడేవారికి లాక్ డౌన్ పెను సమస్యాత్మకంగా మారింది. బ్లడ్ బ్యాంక్స్‌లో రక్త నిల్వలు అడుగంటడంతో ఆస్పత్రి వర్గాల్లోనూ తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు ప్రజలు అభిమానులు విరివిగా రక్తదానం చేయాలని అందుకు సమీప బ్లడ్ బ్యాంక్స్‌కి వెళ్లాలని చిరంజీవి పిలుపునిచ్చారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌కి ఆదివారం ఉదయం స్వయంగా వచ్చి రక్తదానం చేశారు. చిరంజీవితో సహా హీరో శ్రీకాంత్, రోషన్, శ్రీమిత్ర చౌదరి.. వారి వారసులు తేజ్ నివాస్, తేజ్ గోవింద్, బెనర్జీ, నటుడు భూపాల్, గోవిందరావు, విజయ్, తదితరులు రక్తదానం చేసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ- ‘లాక్ డౌన్ వేళ రక్త దాతల సంఖ్య గణనీయంగా తగ్గింది.

రక్తం ఇచ్చేవారు లేక కొరత ఎక్కువగా ఉంది. పేషెంట్స్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. తలసేమియా-క్యాన్సర్ వ్యాధిగ్రుస్తులు.. బైపాస్ సర్జరీ, హార్ట్ రోగులు, ప్రమాదాలకు గురైనవారు, ఎనీమియా వంటి సమస్యలు ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో రక్తం లేక ఇబ్బంది పడుతున్న వారిని ఆదుకునేందుకు ప్రజలు అభిమానులు ముందుకు రావాలి. మీకు సమీపంలో ఉన్న బ్లడ్ బ్యాంక్స్‌కి రక్తదానం చేయండి. స్వచ్ఛందంగా రక్తదానం చేస్తే ప్రాణదానం చేసినవారు అవుతారు. ఈ బాధ్యత మనందరిపైనా ఉంది.

తమ్ముడు శ్రీకాంత్, మిత్రుడు శ్రీమిత్ర చౌదరి వారి స్నేహితులు వచ్చి రక్తదానం ఇచ్చి స్ఫూర్తి నింపారు. దీనిని ఇన్ స్పిరేషన్‌గా తీసుకుని ఇరు తెలుగు రాష్ట్రాల్లో నా అభిమానులు రక్తదానం చేయాలని కోరుతున్నాను. లాక్ డౌన్ ఉన్నా రక్తదానం చేయువారిని ఎవరూ ఆపరు. బయట పోలీసుల వల్ల ఏ ఇబ్బందీ తలెత్తదు. రక్తదానం చేస్తున్నాం అని తెలపగానే బ్లడ్ బ్యాంక్ వారి నుంచి మీ ఫోన్ వాట్సాప్‌కు పాస్ వస్తుంది. అది పోలీసులకు చూపిస్తే సరిపోతుంది’ అని తెలిపారు.

ఆ పాత రోజులు మళ్లీ రావాలి : చిరు

లాక్ డౌన్ వల్ల ఎక్కడివాళ్లు అక్కడే గప్ చుప్ అయిపోవాల్సివచ్చింది. ఎవరి ఇళ్లలో వాళ్లే. ఆదివారం వస్తే చాలు బంధువులు, స్నేహితుల ఇంటికి వెళ్లి విందు వినోదాలతో కాలక్షేపం చేసేవాళ్లు.. ఆ ఆనందాన్ని మిస్ అవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఇంతే. లాక్ డౌన్ వల్ల ఆయనేం మిస్ అవుతున్నారన్న విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. లాక్ డౌన్‌కి ముందు ఓ ఆదివారం, తన ఇంట్లో సరదాగా తమ్ముళ్లతోనూ, అమ్మతోనూ కలిసి లంచ్ చేస్తున్న ఫోటోని ఈ సందర్భంగా చిరు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

Fans donate blood says Megastar chiranjeevi
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News