Monday, April 29, 2024

కలహాలకు కుటుంబం బలి : ఐదుగురు బలవన్మరణం

- Advertisement -
- Advertisement -

Five of family found dead in Haryana

చండీగఢ్ : హర్యానా లోని పల్వాల్ జిల్లా ఔరంగాబాద్ గ్రామంలో కుటుంబ కలహాలకు ఐవుడురు బలయ్యారు. ఇంట్లో గొడవలతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ వ్యక్తి హిర్యకు, ఒద్దరు పిల్లలకు, మేనకోడలుకు విషమిచ్చి చంపేశాడు. అంతేకాక విషం సేవించి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దాంతో ఒక కుటుంబానికి చెందిన ఐదుగురు విగతజీవులయ్యారు. బుధవారం ఉదయం 7.30 గంటలకు మృతుడి తండ్రి గమనించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కుటుంబ కలహాలతో కలత చెందిన 33 ఏళ్ల వ్యక్తి భార్యకు, 11 ఏళ్ల కొడుకుకు, ఏడేళ్ల బిడ్డకు, తొమ్మిదేళ్ల మేనకోడలుకు విషమిచ్చి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. మరుసటి రోజు ఉదయం ఇంట్లోంచి ఎవరూ రాకపోవడంతో మృతుని తండ్రి అనుమానించి వెళ్లి చూడగా ఒకే గదిలో ఐదుగురూ విగతజీవులుగా కనిపించారు. పోలీసులు ఈ దుర్ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News