Sunday, April 28, 2024

మాజీ మంత్రి కుమార మంగళం భార్య హత్య : నిందితుడి అరెస్టు

- Advertisement -
- Advertisement -

Former minister Kumar Mangalam wife murder

 

న్యూఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి, దివంగత పి. రంగరాజన్ కుమార మంగళం భార్య కిట్టి కుమార మంగళం (67) మంగళవారం రాత్రి తన నివాసంలో హత్యకు గురయ్యారు. ఢిల్లీ లోని వసంత విహార్‌లో గల తన నివాసంలో మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో ఇంట్లో దోబీగా పనిచేస్తున్న రాజు అనే వ్యక్తి ఈ హత్యకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు. మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో నిందితుడు కిట్టి కుమార మంగళం ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ కొట్టగా పని మనిషి తలుపు తీసింది. ఆమెపై మత్తు మందు జల్లి ఓ గదిలో పడేశాడు. కుమార మంగళం గది లోకి వెళ్లి ఆమె ముఖంపై దిండు అదిమి పెట్టి ఊపిరాడకుండా హత్య చేసినట్టు పోలీసులు చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News