Monday, April 29, 2024

మళ్లీ బంగారం జోరు..

- Advertisement -
- Advertisement -

Gold price again increased in India

ముంబై: కొద్ది రోజులుగా తగ్గుతున్నట్టు కనిపించిన బంగారం ధర మళ్లీ పెరిగింది. మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల పసిడి ధర రూ.1,182 పెరిగి రూ.54,856కు చేరింది. ఇంతకుముందు రోజు బంగారం ధర రూ.53,674 (10 గ్రాములు) వద్ద ముగిసింది. వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. కిలో వెండి ధర రూ.1,587 పెరిగి రూ.72,547కు చేరింది. దీనికి ముందు ట్రేడింగ్‌లో కిలో వెండి ధర రూ.70,960గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్స్‌కు 2,005 డాలర్లు, వెండి ఔన్స్ 28 డాలర్లుగా ఉంది. మంగళవారం స్పాట్ ఇంటర్నేషనల్ ధర ట్రేడింగ్ 2000 డాలర్లపైన కొనసాగుతోందని హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీ సీనియర్ అనలిస్ట్ (కమోడిటీస్) తపన్ పటేల్ అన్నారు.

Gold price again increased in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News