Monday, April 29, 2024

మిలాన్‌లో గోపీచంద్, శ్రీనువైట్ల మూవీ షూటింగ్ పూర్తి..

- Advertisement -
- Advertisement -

మాచో స్టార్ గోపీచంద్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో చిత్రాలయం స్టూడియోస్ ప్రొడక్షన్ నెం.1 గా హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ రూపొందుతోంది. మాస్, ఫ్యామిలీస్‌ని సమానంగా మెప్పిస్తూ యాక్షన్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లను అందించడంలో సిద్ధహస్తుడైన శ్రీను వైట్ల… గోపీచంద్ ను ఇంతకు ముందు చేయని పూర్తి భిన్నమైన పాత్రలో చూపిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో లావిష్‌గా రూపొందనున్న ఈ చిత్రం మిలాన్ షూటింగ్ షెడ్యూల్ పూర్తయింది.

ఇటలీ మిలాన్‌లోని కొన్ని అద్భుతమైన లోకేషన్స్‌లో హీరో గోపీచంద్ తో పాటు ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలని చిత్రీకరించారు. స్టార్ కొరియోగ్రఫర్ శేఖర్ మాస్టర్ నేతృత్వంలో ఓ గ్రాండ్ సాంగ్‌ని కూడా ఈ షెడ్యూల్‌లో పూర్తి చేశారు. సినిమాలో చాలా భాగం విదేశాల్లోని కొన్ని అద్భుతమైన లొకేషన్లలో చిత్రీకరించనున్నారు. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ వేణు దోనేపూడి ఈ చిత్రాన్ని చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై అత్యుత్తమ ప్రొడక్షన్, టెక్నికల్ స్టాండర్డ్‌తో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News