Monday, April 29, 2024

త్వరలో గ్రూప్-4

- Advertisement -
- Advertisement -

ఉపాధ్యాయ పోటీ పరీక్షలకు సిద్ధంగా ఉండండి

317 జిఓను రద్దు చేయాలన్న ప్రతిపక్షాల అందోళన సరికాదు
ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు

మన తెలంగాణ/సిద్దిపేట టౌన్: త్వరలో గ్రూప్4 నోటిఫికేషన్ రాబోతున్నదని అందు కు యువతీయువకులంతా సిద్ధ్దంగా ఉండాలని రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్ కింద సుమారు 500 పోస్టులను భర్తీ చేయనున్నట్టు తెలిపారు. అదేవిధంగా డీ ఎస్సీ నోటిఫికేషన్ కూడా ఇచ్చేందుకు ప్రభు త్వం యోచన చేస్తుందన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా పొన్నాల సమీపంలోని జిల్లా తెలంగాణ భవన్‌లో కెసిఆర్ ఉచిత టెట్ కో చింగ్ సెంటర్ ద్వారా టెట్ కోచింగ్ తీసుకుని అర్హత సాధించిన విద్యార్థులతో మంత్రి ము ఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ కేంద్రం ద్వారా గ్రూప్4కు సైతం ఉచితంగా కోచింగ్ ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. టెట్‌లో ఉత్తీర్ణత సా ధించిన అభ్యర్థులు డీఎస్సీకి సైతం ఇప్పటి నుంచే సంసిద్ధ్దంగా ఉండాలని సూచించారు. డీఎస్సీ నోటిఫికేషన్ ముందునుంచే లాంగ్ టర్మ్ శిక్షణ ఇప్పిస్తామన్నారు. టెట్ పరీక్షలో ఉత్తీర్ణత 32 శాతం అయితే కేవలం సిద్దిపేటలో నిర్వహించిన కెసిఆర్ ఉచిత శిక్షణ కేంద్రంలో 82 శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు.

ఇక్కడ 618 మంది అభ్యర్థ్ధులకుగాను 517పాస్ అయ్యారన్నారు. కోచింగ్ తీసుకున్నవారు ఉద్యోగాలు సాధించినప్పుడే ఇక్కడ ఇచ్చిన శిక్షణకు సార్ధకత లభిస్తుందన్నారు. ఈసారి ఉద్యోగాలు సాధించిన అభ్యర్థ్ధులు చాలా అదృష్టవంతులన్నారు. సిఎం కెసిఆర్ రాష్ట్రపతి ఉత్తర్వులు తెచ్చి స్థానికులకే ఉద్యోగాలు వచ్చేలా కృషి చేశారని మంత్రి తెలిపారు. 317 జిఓను రద్దు చేయాలని దాని అంతర్యం తెలియకుండా ప్రతిపక్షాలు అందోళన చేయడం సిగ్గుచేటన్నారు. కేంద్రంలో 16.50లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వాటిని వెంటనే భర్తీ చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం గతేడాదినాటికి ప్రకటించిన లక్షా 50వేల ఉద్యోగాలకుగానూ ఇప్పటికే లక్షా 30 ఉద్యోగాలు ఇచ్చామని, ఇప్పడు మరో 90వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన అగ్నిపథ్ తుమ్మితే ఊడిపోయే ఉద్యోగం, యువతను మోసం చేయడానికే తెచ్చారని మంత్రి విమర్శించారు.

బిజెపి ప్రభుత్వం అమ్మడం తప్ప కొత్తగా తెచ్చేది ఏమీలేదని, ఏ రంగానికి కూడా బిజెపి ప్రభుత్వం మేలు చేయలేదన్నారు. రూపాయి విలువ పతనమై దేశంలో 8.7 శాతం నిరుద్యోగ సమస్య ఉన్నదని మంత్రి అన్నారు. ఫెక్ న్యూస్ క్రియేట్ చేయడంలో బిజెపి ప్రభుత్వానికి డాక్టరేట్ ఇవ్వాలన్నారు. బిజెపి ప్రభుత్వ నేతల మాటల్లో విషం తప్ప విషయం లేదన్నారు. సిద్దిపేట అంతా కుటుంబంగా భావించి అభివృద్ధి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ సభ్యుడు పాల సాయిరాం, టిఆర్‌ఎస్ పట్టణ యువజన అధ్యక్షుడు రెడ్డి ప్రభాకర్‌రెడ్డి, సర్పంచ్ రేణుక శ్రీనివాస్, టెట్ కోచింగ్ నిర్వాహకులు గోవర్ధన్‌రెడ్డి, శ్రీనివాస్, ఎంపిటిసి యాదగిరి, కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు, పలువురు యువతీయువకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News