Monday, April 29, 2024

కరెంట్ షాక్… చెత్త బకెట్‌తో చెయ్యి తెగిపడింది…

- Advertisement -
- Advertisement -

Hand removed with current shock

అమరావతి: కరెంట్ షాక్ తగిలి బాలిక చేయి తెగి కిందపడిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఫరీదా, సయ్యద్ ఆరిపుల్లా అనే దంపతులు అక్కాయపల్లెలో నివసిస్తున్నారు. సయ్యద్ ఆరిపుల్లా జీవనోపాధి నిమిత్తం దుబాయ్‌కు వెళ్లాడు. ఫరీదా తన ముగ్గురు సంతానంతో కలిసి అక్కాయాపాలెంలోని తన ఇంట్లో రెండో అంతస్థులో ఉంటుంది. చెత్తను వేయడానికి ఓ బకెట్‌ను వాడుతున్నారు. సెకండ్ ఫ్లోర్ నుంచి బకెట్‌ను తాడు సహాయంతో కిందకు దించి చెత్తను ట్రాలీలో వేసేవారు. తాడు లేకపోవడంతో ఆమె పెద్ద కుమార్తె అయిషా(13) బకెట్ కు పాత కరెంట్ తీగ కట్టి కిందకు దించింది. కరెంట్ తీగకు అక్కడ అక్కడ అతుకులు ఉండడంతో ఇంటికి సమీపంలో ఉన్న 11 కెవి విద్యుత్ తీగలు తగలాయి.  దీంతో అయిషాకు కరెంట్ షాక్ తగలడంతో చెయ్యి తెగిపడిపోయింది. కూతురిని రక్షించే క్రమంలో తల్లి కూడా తీవ్రంగా గాయపడింది. స్థానికులు ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News