మన తెలంగాణ/హైదరాబాద్: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీని ప్రభావంతో మంగళవారం ఆదిలాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ పట్టణం, వరంగల్ గ్రామీణం, మహబూబాబాద్, జనగామ, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం సోమవారం ఉదయం తీవ్ర అల్పపీడనంగా మారిందని పేర్కొంది. దీనికి అనుబంధంగా మధ్యస్థట్రోపోస్పియర్ స్థాయిల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది ఎత్తుకు వెళ్లే కొద్దీ.. నైరుతి దిశవైపుకు వంపు తిరిగి ఉందని వివరించారు.
Heavy Rainfall Warning to Telangana