Monday, April 29, 2024

అండమాన్ తీరంలో అల్పపీడనం…

- Advertisement -
- Advertisement -

అమరావతి: అండమాన్ తీరంలో అల్పపీడనం ఏర్నడిన నేపథ్యంలో తిరుపతి, నెల్లూరులలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈనెల 28, 29 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సుమారు 13 సెం.మీ వర్షపాతం నమోదు కావొచ్చని వాతావరణ శాఖ అధికారుల అంచనా వేస్తున్నారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో చిత్తూరు జిల్లాలో విద్యాలయాలకు కలెక్టర్ సెలవులు ప్రకటించారు. తూర్పు ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం నమోదుకు అవకాశం ఉండడంతో అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కాజ్ వే లు దాటరాదని, అవసరమైన చోట పునరావాస కేంద్రాల ఏర్పాటు చేయాలని అధికారులకు జిల్లా కలెక్టర్ ఎం.హరిణారాయణన్ తెలిపారు. హైదరాబాద్ లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News