Sunday, April 28, 2024

సహాయక చర్యలు ముమ్మరం

- Advertisement -
- Advertisement -

helicopter transporting goods to flood-affected areas

వరద ప్రభావిత ప్రాంతాలకు నిత్యావసర వస్తువులను తరలిస్తున్న హెలికాప్టర్

హైదరాబాద్ : వరద ప్రభావిత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల, దుమ్ముగూడెం మండలాల బాధిత ప్రజలకు సహాయక సామగ్రిని ఐఎఎఫ్ సిబ్బంది చేతక్ హెలికాప్టర్ ద్వారా అందజేశారు. గురువారం చర్ల గ్రామంలో 470 కిలోలు, దుమ్ముగూడెం గ్రామంలో 670 కిలోల సహాయక సామాగ్రిని బాధిత కుటుంబాలకు అందజేసేందుకు తరలించారు. జిల్లాలోని అత్యంత ప్రభావిత ప్రాంతాలకు అవసరమైన 1930 కిలోల సహాయ సామాగ్రిని ఇప్పటి వరకు హెలికాప్టర్ ద్వారా అందజేశారు. జిల్లాలో చేపట్టే సహాయక చర్యల్లో భాగంగా మరి కొన్ని రోజుల్లో హెలికాప్టర్‌ను వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News