Sunday, April 28, 2024

నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్..

- Advertisement -
- Advertisement -

ఆసిఫాబాద్‌ః మండలంలోని అందవెల్లి గ్రామంలో మండలానికి చెందిన ధనుర్కార్ పాండు గుండి గ్రామానికి చెందిన రాసిపల్లి నానజీ వద్ద గత ఏడాది అప్పుగా తీసుకున్న నగదును తిరిగి చెల్లించుటకై గుండి గ్రామానికి చెందిన ఆసిఫాబాద్ నుండి ఆటోలో వస్తు ఉండగా జేబులో ఉన్న 40 వేల రూపాయలు దారిలో పడిపోయాయి. కాసేపటికి అటు వైపు నుండి వస్తున్న ఆసిఫాబాద్‌కి చెందిన ఆటో డ్రైవర్ ఎస్‌కే సలీం గమనించి మొదటగా అక్కడే ఉన్న

బెల్లంపల్లికి చెందిన ప్రవేట్ ఉద్యోగి మిట్టపల్లి శ్రీకాంత్ అనుకోని ఆయనకు ఇవ్వగా శ్రీకాంత్ గ్రామ సర్పంచ్ జబరి ఆరుణ రవిందర్‌కు ఇచ్చారు. విషయం తెలుసుకోని గ్రామాస్తులకు విచారించగా రోదిస్తూ దారి పొడుగునా వెతుకుతున్న ధనుర్కార్ పాండువని తెలుసుకోవడంతో వారికి ఎఎంసి చైర్మన్ గాదావేణి మల్లేష్, సర్పంచ్ జబరి అరుణ రవిందర్ చేతుల మీదుగా గ్రామస్తుల సమక్షంలో నగదును అందించారు. ఈ సందర్భంగా వారిని అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News