- Advertisement -
పేట్బషీరాబాద్ : భర్తతో గొడవ పడి భార్య తన ఇద్దరు కూతుర్లతో కలిసి అదృశ్యమై న సంఘటన పేట్బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం సుభాష్నగర్ డివిజన్ పరిధిలోని భాగ్యలక్ష్మీకాలనీలో నివాసం ఉం టున్న సతీష్, లక్ష్మీ అలియాస్ రాజేశ్వరి (30) దం పతులకు వజ్ర (7) కీర్తి (5) ఇద్దరు కూతుర్లు. ఈ నెల 13న మధ్యాహ్నాం సమయంలో భార్య భర్తల మధ్య గొడవ జరిగింది. ఆవేదనకు లోనైనా భార్య లక్ష్మీ తన ఇద్దరు కూతుర్లతో కలిసి బయటకు వెళ్ళి తిరిగి ఇం టికి చేరుకోలేదు. ఈ విషయాన్ని సతీష్ తన అత్తకు ఫోన్ చేసి చెప్పాడు. వారి ఆచూకీ కోసం చుట్టు పక్కల, బంధువుల వద్ద వెతికినా ఫలితం లేకపొవడంతో లక్ష్మీ తల్లి ఉపేంద్రమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Housewife disappeared with two daughters in hyderabad
- Advertisement -