Sunday, April 28, 2024

శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం..

- Advertisement -
- Advertisement -

అమరావతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం కూడా అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. శ్రీవారి దర్శనం కోసం 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు.

కాగా, శనివారం శ్రీవారిని 86,170 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమలలో నిన్న 31,128 మంది భక్తులు నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.13 కోట్లు వచ్చిందని టిటిడి అధికారులు వెల్లడించారు. ఈరోజు ఆలయంలో ఆణివార ఆస్థానం నిర్వహించనున్నారు. సాయంత్రం పుష్ప పల్లకిలో మలయప్పస్వామి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. దీంతో ఈ రోజు శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టిటిడి తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News