Monday, April 29, 2024

గర్భవతిని కదులుతున్న బస్సులోనుంచి తోసేసిన భర్త

- Advertisement -
- Advertisement -

చెన్నై: తమిళనాడు రాష్ట్రం దిండుక్కల్ జిల్లాలో గర్భంతో ఉన్న భార్యను కదులుతున్న బస్సులోనుంచి భర్త తోసేశాడు. భార్య ఘటనా స్థలంలోనే మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. వెంబార్ పట్టికి చెందిన పాండియన్, కల్‌వెల్లిపట్టికి చెందిన వళర్మతికి(18) 2023 ఏప్రిల్‌లో వివాహం జరిగింది. వళర్మతి ఐదునెలల గర్భంతో ఉంది. ఇద్దరు దంపతులు కలిసి గోపాల్‌పట్టికి వెళ్లేందుకు బస్సు ఎక్కారు. పాండియన్ మద్యం మత్తులో ఉండడంతో ఇద్దరు మధ్య గొడవ జరిగింది. కనవాయిపట్టి శివారులోకి రాగానే భార్యను భర్త బస్సులోనుంచి బయటకు తోసేశాడు. ఆమె తలకు బలమైన గాయాలు కావడంతో ఘటనా స్థలంలోనే ఆమె చనిపోయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News