Friday, May 17, 2024

మావోల నుంచి భర్తను విడిపించుకున్న భార్య

- Advertisement -
- Advertisement -

Husband released from Maoist

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో ఇంజినీర్ భార్య అర్పిత పోరాటం ఫలించింది. వారం రోజుల క్రితం బీజాపూర్ జిల్లా మన్‌కేళి దగ్గర అజయ్, లక్ష్మణ్‌ను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. మరుసటి రోజు లక్ష్మణ్‌ను మావోయి వదిలిపెట్టారు. తన భర్తను వదిలిపెట్టాలని భార్య అర్పిత అడవిలోకి మావోయిస్టుల వద్దకు వెళ్లారు. రెండేళ్ల చిన్నారిని ఎత్తుకుని స్థానిక మీడియా ప్రతినిధులతో కలిసి అడవిలోకి వెళ్లారు. తన భర్తను ప్రాణాలతో విడిచిపెట్టాలని మావోలకు విజ్ఞప్తి చేశారు. ప్రజాకోర్టు నిర్వహించి అజయ్‌ను మావోలు విడిచిపెట్టారు. అజయ్ కిడ్నాప్‌పై స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News