లక్నో: ఇప్పటికే ఐదుగురు కుమార్తెలకు తండ్రి.. కుమారుడి కోసం భార్య గర్భాన్ని కత్తితో చీల్చిన సంఘటన ఉత్తర ప్రదేశ్లోని బరేలీ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పన్నాలాల్ , అనితా దేవీ అనే దంపతులు ఇప్పటికే ఐదుగురు కూతుళ్లకు జన్మనిచ్చారు. ఆరో సారి కుమారుడి కావాలని భార్యను పన్నాలాల్ వేధించేవాడు. అతడి భార్య ఏడో నెల గర్భవతి కావడంతో గర్భంలో ఉన్నది అబ్బాయా? అమ్మాయా? అనేది తెలుసుకోవడానిక పదునైన కత్తితో ఆమె పొట్టను కోశాడు. ఆమె కేకలు వేయడంతో స్థానికులు వచ్చి రక్తపు మడుగులో ఉన్న ఆమెను బరేలీ ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ ప్రవీణ్ సింగ్ చౌహాన్ తెలిపాడు. ప్రస్తుతం గర్భవతి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మగ సంతానం కోసం ఇప్పటికే ఐదుగురు ఆడ బిడ్డలకు పన్నాలాల్ జన్మనిచ్చి ఈ దారుణానికి పాల్పడ్డాడు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
కుమారుడే కావాలని…. భార్య గర్భాన్ని చీల్చి…
- Advertisement -
- Advertisement -
- Advertisement -