దుబాయ్: ఐపీఎల్-13వ సీజన్ లో భాగంగా దుబాయ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య జరుగుతున్న సెకండ్ మ్యాచ్ మరికొద్ది సేపట్లో ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుని, ఢిల్లీని బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్ లో విజయం సాధించి ఘనంగా టోర్నీని ప్రారంభించాలని రెండు జట్లు భావిస్తున్నాయి. ఇక, శనివారం జరిగిన తొలి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది.