Monday, April 29, 2024

కన్నీళ్లు పెట్టిస్తున్న కల్నల్ తల్లి మాటలు

- Advertisement -
- Advertisement -

I am proud of my son says martyred Colonels mother

హైదరాబాద్ : భారత్ – చైనా సరిహద్దు ఘర్షణల్లో సూర్యాపేట వాసి కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు మృతిపై ఆయన తల్లి మంజుల స్పందించారు. తన కుమారుడు సంతోష్ బాబు దేశం కోసం పోరాడి అమరుడైనందుకు సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. నా ఒక్కగానొక్క కొడుకు చనిపోవడం తల్లిగా బాధగా ఉంది. కానీ దేశం కోసం నా కుమారుడు అమరుడైనందుకు సంతోషంగా ఉంది అని మంజుల పేర్కొనడం ప్రతి ఒక్కరి హృదయాలను కలిచివేసింది. ఇంతటి పెను విషాదంలోనూ ఆ తల్లి ఈ విధంగా మాట్లాడడం వారి దేశ భక్తిని చాటుతోంది. కాగా, సంతోష్ తల్లిదండ్రులు సూర్యాపేట పట్టణంలోని విద్యానగర్‌లో నివాసం ఉండగా.. భార్య, పిల్లలు ఢిల్లీలో ఉన్నారు. తండ్రి ఉపేందర్ స్టేట్ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు.

I am proud of my son says martyred Colonels mother

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News