Monday, April 29, 2024

145 పరుగులకే ఇంగ్లాండ్ ఆలౌట్.. భారత్ లక్ష్యం ఎంతంటే?

- Advertisement -
- Advertisement -

రాంఛీ: భారత బౌలర్ల ధాటికి.. ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్లు చేతులెత్తేశారు. లైన్ అండ్ లెంగ్త్ బంతులతో చెలరేగుతుండడంతో ఇంగ్లీష్ బ్యాట్స్ మెన్స్ వరుసగా పెవిలియన్ కు క్యూ కట్టారు. దీంతో నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టు 53.5 ఓవర్లలో కేవలం 145 పరుగులకే పరిమితమైంది.

ఓపెనర్ జాక్ క్రాలే(60) ఒక్కడే అర్థ శతకంతో రాణించగా.. జానీ బయిర్‌స్టో 30 పరుగులు చేశాడు. టీమిండియా బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 5 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 4 వికెట్లతో సత్తా చాటగా.. జడేజా ఒక వికెట్ తీశారు. దీంతో ఇంగ్లాండ్. భారత్ కు 191 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది.

కాగా, ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 353 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇండియా తొలి ఇన్నింగ్స్ లో 307 పరుగులు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News