Sunday, April 28, 2024

రెండో వన్డే: టీమిండియా లక్ష్యం 276

- Advertisement -
- Advertisement -

కొలంబో: ప్రేమదాస స్టేడియం వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో శ్రీలంక, భారత జట్టుకు 276 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన లంకకు ఓపెనర్లు ఫెర్నండో(50), మినోద్ భనుక(36)లు శుభారంభం అందించారు. వీరిద్దరూ తొలి వికెట్ కు 77 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. వీరు ఔటైన తర్వాత వచ్చినవారు విఫలమైనా.. చివర్లలో అసలంకా(65), కరుణరత్నె(44)లు బ్యాట్ ఝుళిపించడంతో లంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, యుజ్వేందర్ చాహల్ లు చెరో మూడు వికెట్లు పడగొట్టగా, దీపక్ చాహర్ రెండు వికెట్లు తీశారు.

IND vs SL 2nd ODI: SL Sets 276 runs Target for IND

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News