Sunday, April 28, 2024

భారత్, శ్రీలంక సిరీస్ వాయిదా..

- Advertisement -
- Advertisement -

శ్రీలంక క్రికెట్‌లో కరోనా కల్లోలం సృష్టించడంతో భారత్‌తో జరిగే సిరీస్ షెడ్యూల్‌లో మార్పు చేశారు. ఈ నెల 13 నుంచి ప్రారంభం కావాల్సిన సిరీస్‌ను వాయిదా వేశారు. కొత్త షెడ్యూల్ ప్రకారం సిరీస్ ఈ నెల 17నుంచి జరుగనుంది. అయితే దీనిపై శ్రీలంక క్రికెట్ బోర్డు నుంచి అధికారిక ప్రకటన రాలేదు. ఇదిలావుండగా బ్యాటింగ్ కోచ్ ఫ్లవర్‌తో పాటు డేటా అనలిస్ట్ కరోనా బారిన పడడంతో లంక జట్టంతా క్వారంటైన్‌లోకి వెళ్లి పోవాల్సి వచ్చింది. దీంతో భారత్‌తో నిర్ణీత షెడ్యూల్ ప్రకారం సిరీస్‌ను నిర్వహించే పరిస్థితి లేకుండా పోయింది. ఇలాంటి స్థితిలో లంక బోర్డు సిరీస్‌ను వాయిదా వేయాలని నిర్ణయించింది. దీనికి భారత క్రికెట్ బోర్డు కూడా సానుకూలంగా స్పందించడంతో సిరీస్ 17నుంచి ప్రారంభం కానుంది.

IND vs SL ODI Series postponed

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News