Sunday, April 28, 2024

అగ్రరాజ్యంగా అవతరిస్తున్న భారత్

- Advertisement -
- Advertisement -

వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో కేంద్ర మంత్రి ఆర్‌కె సింగ్

కేంద్ర ప్రభుత్వ పథకాల అవగాహనకే సంకల్ప్ యాత్ర

మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రతి పేద కుటుంబాన్ని అభివృద్ధిలోకి తేవడానికి కేంద్ర ప్రభుత్వం నిబద్ధతతో చేపడుతున్న కార్యక్రమాలకు తిరుగులేదని కేంద్ర విద్యుత్, నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్ కె. సింగ్ అన్నారు. హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్‌లోని హైలమ్ కాలనీ, బాగ్‌లింగంపల్లి – సుందరయ్య పార్కులో శనివారం జరిగిన వికాసిత్ భారత్ సంకల్ప యాత్రలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేం ద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడంలో ఈ యాత్ర ప్రాముఖ్యతను మంత్రి నొక్కిచెప్పారు. ప్రజలు అభివృద్ధి చెందడానికి ప్రభుత్వ పథకాలు ఎలా సహాయపడతాయో తెలిపారు.

ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోని వారు కూడా దరఖాస్తు చేసుకుని ప్రయోజనాలను పొందాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని తమ జీవితాలను మెరుగుపరుచుకునేందుకు ఇదో చక్కటి అవకాశమని అన్నారు. ప్రధానమంత్రి నేతృత్వంలో భారతదేశం సూపర్ పవర్‌గా ఎదుగుతోందని అన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, 5 లక్షల వరకు ఆరోగ్య బీమా అందించే ఆయుష్మాన్ భారత్, వీధి వ్యాపారులకు వ్యాపార ప్రయోజనాల కోసం రుణాలు అందించే ప్రధానమంత్రి స్వానిధి యోజన, జీవన్ జ్యోతి బీమా యో జన, తక్కువ ప్రీమియంతో బీమా పథకం వంటి వివిధ పథకాలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. లబ్ధిదారులు ఎలాంటి పూచీకత్తు లేకుండా వ్యాపార రుణం కోసం దరఖాస్తు చేసుకోవడానికి వీలు కల్పించే ముద్రా యోజన సమాజంలోని ఆర్థికంగా బలహీన వర్గాలకు ప్రయోజనం చేకూర్చుతుందని అన్నారు. దేశంలోని పేదలందరికీ 5 సంవత్సరాలకు 5 కిలోల ఉచిత రేషన్‌ను ప్రధానిమంత్రి అందింస్తున్నారని కేంద్ర మంత్రి చెప్పారు. దేశాన్ని శక్తివంతం చేశామని, మన శత్రువులు ఉగ్రదాడులు చేయడం మానేశారని ఆర్‌కె సింగ్ అన్నారు.

పాకిస్తాన్ అయినా చైనా అయినా వారికి తగిన సమాధానం ఇచ్చామన్నారు. భారత దేశం ప్రపంచంలో 5వ అతిపెద్ద శక్తిగా ఉందని, దేశాన్ని బలోపేతం చేయడమే మా ప్రధాన లక్ష్యమని అన్నారు. ఆ తర్వాతే పేద ప్రజలను పేదరికం నుండి బయటకు తీసుకురావడమని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ప్రతి పేదవాడికి ఆహారం, విద్యుత్, నీరు అందుబాటులో ఉండాలన్నారు. ఈ యాత్రలో పాల్గొనే వారి సంఖ్య 12 కోట్లకు దాటిందని చెప్పారు. అంతకుముందు, మంత్రి ఐఈసి వాహనాన్ని ఫ్లాగ్ ఆఫ్ చేసి, వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి సమాచారాన్ని ప్రదర్శించే సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఐఈసి మెటీరియల్‌ను కేంద్ర మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన వివిధ కేంద్ర ప్రభుత్వ స్టాళ్లను మంత్రి సందర్శించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News