- Advertisement -
కెన్నింగ్టన్: ఓవల్ మైదానంలో ఇండియా-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్లో రెండో ఇన్నింగ్స్ నాలుగో రోజు భారత జట్టు 109 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 304 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ప్రస్తుతం భారత్ 205 పరుగుల ఆధిక్యంలో ఉంది. రవీంద్ర జడేజా 17 పరుగులు చేసి క్రిష్ వోక్స్ బౌలింగ్లో ఎల్బిడబ్లుగా ఔటయ్యాడు. అజింక్య రహానే పరుగులేమీ చేయకుండా డకౌట్ రూపంలో వోక్స్ బౌలింగ్లో ఎల్బిడబ్లు రూపంలో మైదానం వీడాడు. క్రీజులో విరాట్ కోహ్లీ(40), రిషబ్ పంత్ (3) బ్యాటింగ్ చేస్తున్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఓలీ రాబిన్సన్, క్రిష్ వోక్స్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా జేమ్స్ అండర్సన్ ఒక వికెట్ తీశాడు. మూడో రోజు రోహిత్ శర్మ సెంచరీతో మోత మోగించాడు.
ఇండియా తొలి ఇన్నింగ్స్: 191
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 290
- Advertisement -