Saturday, April 27, 2024

సమంత ‘జాను’గా చేయకుంటే సినిమానే లేదు

- Advertisement -
- Advertisement -

శర్వానంద్, సమంత అక్కినేని హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ ‘జాను’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై సి.ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఈనెల 7న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో నేచురల్ స్టార్ నాని, దర్శకుడు వంశీ పైడిపల్లి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ “ఈ సినిమాలో శర్వానంద్, సమంత నటిస్తున్నారని తెలియగానే ఈ చిత్రాన్ని ఎప్పుడు చూస్తామా? అనిపించింది. ట్రైలర్ చూసినప్పుడు ఆ నమ్మకం నిజమైంది. తమిళంలో సినిమాను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమారే తెలుగులో కూడా ఈ చిత్రాన్ని చేస్తున్నారు కాబట్టి ఎక్కడా ఫీల్ మిస్ అయి ఉండదు”అని అన్నారు. దిల్‌రాజు మాట్లాడుతూ “మా బ్యానర్ ప్రారంభించి 17 ఏళ్లు అవుతోంది.

మా బ్యానర్‌లో వస్తోన్న తొలి రీమేక్ ఇది. జానుగా సమంతను తప్ప మరొకరిని ఆ పాత్రలో ఊహించుకోలేకపోయాను. సమంత, శర్వానంద్ ఈ చిత్రంలో అద్భుతంగా నటించారు”అని చెప్పారు. సమంత మాట్లాడుతూ “ఈ సినిమాలో నటించే గొప్ప అవకాశాన్ని నాకు దిల్‌రాజు ఇచ్చారు. నా పర్‌ఫార్మెన్స్‌కు ఏదైనా క్రెడిట్ దక్కితే అది శర్వా వల్లనే అవుతుంది. నేను అందరినీ గర్వంగా ఫీలయ్యేలా చేస్తానని అనుకుంటున్నాను”అని తెలిపారు. శర్వానంద్ మాట్లాడుతూ “సమంత జానుగా చేయకుంటే ఈ సినిమానే లేదు. ఆరేళ్ల నుండి 90 ఏళ్ల వయసు వారందరికీ ఈ సినిమా కనెక్ట్ అవుతుంది”అని పేర్కొన్నారు.

Jaanu Movie Pre Release Event in Hyderabad

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News