హైదరాబాద్: నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి జానారెడ్డిని అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. గురువారం గాంధీభవన్లో మీడియాతో మాట్లాడిన మాణిక్యం ఠాగూర్ ఈ విషయాన్ని తెలిపారు. టిఆర్ఎస్ ఎంఎల్ఎ నోముల నర్సింహయ్య మరణంతో నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. సిట్టింగ్ స్థానం నిలబెట్టుకోవాలని టిఆర్ఎస్, దుబ్బాక స్ట్రాటజీని అవలంబించి సత్తా చాటాలని బిజెపి వ్యూహరచన చేస్తున్నాయి. ఇక గతంలో తమ సిట్టింగ్ స్థానంగా ఉన్న ఈ సీటును మరోసారి తమ సొంతం చేసుకోవాలని కాంగ్రెస్ యోచిస్తోంది. నాగార్జునసాగర్ అసెంబ్లీ నియో జకవర్గం నుంచి రెండుసార్లు ఎంఎల్ఎగా గెలిచిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డికి ఆ పార్టీ ఛాన్స్ ఇచ్చింది. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలను పాటిస్తామని కోమటిరెడ్డి, రేవంత్ సహా కాంగ్రెస్ నేతలంతా అంగీకరించినట్లు సమాచారం.
నాగార్జున సాగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా జానారెడ్డి
- Advertisement -
- Advertisement -
- Advertisement -