- Advertisement -
అమరావతి: విజయవాడ నగరంలో భారీ దోపిడి జరిగింది. పట్టపగలే షాపులోకి వెళ్లిన దుండగులు బంగారం, నగలు ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన విజయవాడ వన్ టౌన్ సాయిచరణ్ జ్యూవెల్లరీలో శుక్రవారం చోటుచేసుకుంది. 7 కిలోల బంగారం, రూ.30లక్షల నగదు చోరీ అయినట్టు అధికారులు గుర్తించారు. సమాచారం అందుకున్న విజయవాడ సిపి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. షాపులో గుమాస్తా చేతులు, కాళ్లు కట్టేసి ఈ దోపిడి చేసినట్టు సమాచారం. అయితే ఆభరణాలు తయారుచేసేవారే చోరీకి పాల్పడ్డారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. షాపు యాజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
- Advertisement -