Monday, April 29, 2024

జర్నలిస్టు మన్‌దీప్ పునియాకు బెయిల్ మంజూరు

- Advertisement -
- Advertisement -

Journalist Mandeep Punia granted bail

న్యూఢిల్లీ: సింఘూ సరిహద్దుల్లోని రైతుల నిరసన స్థలి వద్ద ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన ఫ్రీలాన్స్ జర్నలిస్టు మన్‌దీప్ పునియాకు ఢిల్లీ కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. ఫిర్యాదుదారు, బాధితులు, సాక్షులు మొత్తం పోలీసు సిబ్బందే ఉన్నారని బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సత్వీర్ సింగ్ లాంబ వ్యాఖ్యానించారు. ఈ కారణంగా పోలీసు అధికారులను నిందితుడు ప్రభావితం చేసే అవకాశం ఏమాత్రం లేదని ఆయన అన్నారు. ముందస్తు అనుమతి లేకుండా పునియా దేశం విడిచి వెళ్లరాదని కోర్టు ఆదేశించింది. పునియాను గత ఆదివారం ఢిల్లీ పోలీసులు సింఘూ సరిహద్దుల్లో అరెస్టు చేసి ఐపిసిలోని వివిధ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

Journalist Mandeep Punia granted bail

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News