Monday, April 29, 2024

‘ఆచార్య’ సెట్‌లో కొత్తజంట..

- Advertisement -
- Advertisement -

అందాల చందమామ కాజ‌ల్ అగ‌ర్వాల్ తన భర్త గౌత‌మ్ కిచ్లుతో కలిసి ‘ఆచార్య’ సెట్‌లో సందడి చేసింది. మెగస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో ‘ఆచార్య’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో చిరు సరసన హీరోయిన్ కాజల్ నటిస్తున్నారు. అయితే, ఇప్పటివరకు కాజల్ ‘ఆచార్య’ సెట్‌లో అడుగుపెట్టలేదు. లాక్ డౌన్ కారణంగా ఈ మూవీ షూటింగ్ వాయిదా పడడం, అదే సమయంలో గత అక్టోబ‌ర్ 30న త‌న చిన్న‌నాటి స్నేహితుడు గౌత‌మ్ కిచ్లుని కాజల్ వివాహం చేసుకుంది. ఆ తర్వాత హనీమూన్ కు వెళ్ళొచ్చిన కాజల్ దంపతులు.. మంగళవారం ‘ఆచార్య’ సెట్‌లో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా నవ దంపతులకు చిరుతోపాటు ‘ఆచార్య’ మూవీ టీమ్ ఘన స్వాగతం పలికింది. కొత్త జంటకు దండలు వేయించి కేట్ కట్ చేయించారు. ఈ సందర్భంగా దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Kajal and Gautam Kitchlu blessings from Chiranjeevi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News