- Advertisement -
న్యూఢిల్లీ: కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో పలువురు సినీ, క్రీడా సెలబ్రెటీలు స్వీయ నిర్భందంలో ఉంటూ సోషల్ మీడియాలో వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను ఎంటర్ టైన్ చేస్తున్నారు. తాజాగా టీమిండియా కెప్టెన్, స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ తన భార్య, సినీ నటి అనుష్కతో కలిసి ఇంటి ఆవరణలో సరదాగా క్రికెట్ అడుతూ కనిపించాడు. విరాట్ కోహ్లీ బౌలింగ్ వేయగా.. అనుష్క శర్మ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ప్రక్క అపార్ట్ మెంట్ వారు దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ అవుతోంది.
Kohli and Anushka Sharma spotted play cricket at home
- Advertisement -