Monday, April 29, 2024

అప్పుడు నాకు చాలా గర్వంగా అనిపించింది

- Advertisement -
- Advertisement -

Krithi Shetty says about her Acting

 

‘ఉప్పెన’ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్న వైష్ణవ్ తేజ్‌కు జోడీగా అందాల తార కృతిశెట్టి నటించింది. బుచ్చిబాబు సానాను దర్శకుడిగా పరిచయం చేస్తూ మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ఈ సినిమాను రూపొందించింది. ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా హీరోయిన్ కృతిశెట్టి మాట్లాడుతూ “నాకు యాక్టింగ్ అంటే ఆసక్తిగా ఉండేది కానీ అదే నా కెరీర్ అనుకోలేదు. నేను డాక్టర్ అవుదామని అనుకున్నాను. కానీ ఈ సినిమా ఆఫర్ వచ్చినప్పుడు బాగుందని అనిపించింది. స్టోరీ విన్నాక చాలా నచ్చింది. అందుకే ఈ సినిమా చేశాను. ఈ సినిమా షూట్‌లో మరచిపోలేని విషయం ఏమిటంటే… ఒక ఎమోషనల్ సీన్ చేసాక డైరెక్షన్ ఆఫ్ ఫోటోగ్రఫీ మానిటర్ వెనుక ఉన్న వారు అంతా చూసి ఏడ్చేశారు. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. అలాగే విజయ్ సేతుపతితో కలిసి నటించడం మరచిపోలేని అనుభూతినిచ్చింది. విజయ్ సేతుపతి సెట్స్‌లో చాలా కామ్‌గా ఉంటారు.

కానీ యాక్షన్ చెప్పగానే ఆయన టాప్ క్లాస్ పర్‌ఫార్మెన్స్ ఇస్తారు. మా ఇద్దరి మధ్య ఒక పెద్ద సీన్ ఉంటుంది. అది చేయగలనా లేదా అన్నపుడు సేతుపతి కొన్ని టిప్స్ కూడా ఇచ్చారు. ఆ సీన్ చాలా బాగుంటుంది. నిజానికి వైష్ణవ్ చాలా డౌన్ టు ఎర్త్‌గా ఉంటాడు. అలాగే అతను బ్రిలియంట్ యాక్టర్. తన ఫస్ట్ మూవీలోనే అద్భుతంగా నటించడం మామూలు విషయం కాదు. తన దగ్గర నుంచి కూడా నేను చాలా నేర్చుకున్నాను. ఈ సినిమా చూసిన సుకుమార్, కొరటాల శివ, మా నిర్మాత నవీన్ ఫోన్ చేసి నా నటనను చాలా మెచ్చుకున్నారు. అలాగే సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో నా నటన గురించి మెగాస్టార్ చిరంజీవి మాట్లాడడం మరచిపోలేని అనుభూతినిచ్చింది. అంత గొప్ప యాక్టర్ నా గురించి మాట్లాడడంతో నాకు చాలా గర్వంగా అనిపించింది”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News