Monday, April 29, 2024

కెటిఆర్‌కు ఐఐటి మద్రాస్ ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : భారత రాష్ట్ర సమి తి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌కు మరో ప్రముఖ ఆహ్వానం అం దింది. దేశంలోనే అత్యుత్తమ ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో మొదటి వరుస లో నిలిచే ఐఐటి మద్రాస్ శని, ఆదివారాలలో జరిగే అంట్రపెన్యురల్ సమ్మి ట్లో ప్రసంగించాల్సిందిగా కెటిఆర్‌ను ఆహ్వానించింది. ప్రతిఏటా ఐఐటి మ ద్రాస్ ఆధ్వర్యంలో నిర్వహించే అంట్రపెన్యురల్ ఫెస్టివల్ సమ్మిట్‌లో కీలకోపన్యాసం చేయాలని కోరింది. ఐఐటి మద్రాస్‌లో ప్రతి ఏటా నిర్వహించే ఈ- సమ్మిట్‌కు దేశ విదేశాల నుంచి అంట్రపెన్యురల్ రంగంలో కీలకమైన వ్యక్తుల ను, సంస్థల అధిపతులను, పాల సీ మేకర్లను, ప్రముఖ వ్యక్తులను ఆహ్వానిస్తుంది. కెటిఆర్‌కు ఉన్న అపారమైన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తు అ్ంర టపెన్యురల్ ఔత్సాహికులకు దిశా నిర్దేశం చేయాల్సిందిగా కెసిఆర్‌కు పంపిన ఆహ్వానంలో ఐఐటి మద్రాస్ కోరింది.

ఐఐటి మద్రాస్ విద్యార్థులు ప్రతిఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దేశంలోనే అంతర్జాతీయ గుర్తింపు ఐఎస్‌ఓ సర్టిఫికేషన్ కలిగిన ఏకైక కార్యక్రమంలో నిలిచింది. శని, ఆదివారాలలో జరగనున్న ఈ కార్యక్రమానికి హాజరై ప్రసంగించాల్సిందిగా కెటిఆర్‌కు పంపిన ఆహ్వానంలో విజ్ఞప్తి చేశారు. ఈసారి ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి పీయూష్ గోయల్, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు ఒకరైన క్రిస్ గోపాలకృష్ణన్, హె చ్‌సిఎల్ సహ వ్యవస్థాపకులు అజయ్ చౌదరి వంటి ప్రముఖులు ఈ కార్యక్రమంలో ప్రసంగించనున్నట్లు ఐఐటి మద్రాస్ తెలిపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News