Monday, April 29, 2024

చివరి మెట్రో రైలు రాత్రి 12.15 గంటలకు బయలుదేరుతుంది…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నేడు హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసులు సమయాన్ని పెంచారు. ఆదివారం అర్థరాత్రి 12.15 గంటలకు వరకు మెట్రో రైలు సర్వీసులు కొనసాగుతాయని మెట్రో రైలు ఎండి ఎన్ విఎస్ రెడ్డి వెల్లడించారు. చివరి రైలు 12.15 గంటలకు బయలుదేరుతుందని, చివరి రైలు అర్థరాత్రి ఒంటిగంటకు గమ్యస్థానానికి చేరుతుందని వివరించారు. మద్యం తాగి వచ్చినా, దుర్భాషలాడినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మెట్రో రైలు, స్టేషన్లలో సిబ్బంది, పోలీసుల నిఘా ఉంటుందని, ప్రయాణికుల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎండి కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News