Monday, April 29, 2024

టిడిపి-బిజెపి పొత్తుపై చర్చ జరగలేదు: లక్ష్మణ్

- Advertisement -
- Advertisement -

BJP leader Laxman tested corona positive

 

హైదరాబాద్: టిడిపితో పొత్తు అని వస్తున్న వార్తలు పుకార్లు మాత్రమేనని రాజ్యసభ ఎంపి, బిజెపి పార్లమెంటరీ బోర్డు మెంబర్ డా లక్ష్మణ్ తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికలలో బిజెపి టిడిపి కలిసి పోటీ చేస్తున్న వార్తల పై  లక్ష్మణ్ స్పందించారు. తెలంగాణలో బిజెపి ఒంటరిగా పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో జనసేనతో కలసి పోటీ చేస్తుందని వివరించారు. ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకు బిజెపికి కార్యకర్తలు పెరుగుతున్నారని, బిజెపి, టిడిపి పొత్తుపై ఎలాంటి చర్చలు కూడా జరగలేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News