Friday, May 17, 2024

చారిత్రక నిర్ణయాలు చాటుకుందాం

- Advertisement -
- Advertisement -

విఆర్‌ఎల క్రమబద్ధ్దీకరణ, ప్రభుత్వంలో ఆర్‌టిసి విలీనం, మెట్రోరైల్ విస్తరణ, అనాథల పాలసీ వంటి మానవీయ అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి

డిపోల ఎదుట ఎక్కడికక్కడ సంబురాలు కార్మికుల కుటుంబాలతో ఆత్మీయ సమావేశాలు ప్రజాప్రతినిధులు, శ్రేణులకు బిఆర్‌ఎస్ వర్కింగ్  ప్రెసిడెంట్ కెటిఆర్ పిలుపు

మనతెలంగాణ/హైదరాబాద్:రాష్ట్రప్రభుత్వం తీసుకున్న ప్రజానుకుల నిర్ణయాలను ప్రజల్లో కి తీసుకెళ్లాలని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెం ట్, మంత్రి కె.తారకరామారావు పార్టీ శ్రేణుల కు పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం పార్టీ ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పా ర్టీ జనరల్ సెక్రెటరీలు, జిల్లా పార్టీ అధ్యక్షుల తో మంత్రి కెటిఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడు తూ సిఎం కెసిఆర్‌నాయకత్వంలో సోమవా రం జరిగిన కేబినెట్ భేటీలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు తెలియచెప్పాలన్నారు. దేశ చరిత్రలో గతంలో ఏ ప్ర భుత్వ హయాంలో కూడా తీసుకోని విధంగా సిఎం కెసిఆర్ తీసుకున్న నిర్ణయాలను ఆయా వర్గాల్లోకి తీసుకెళ్లే బాధ్యత మనపై ఉందని కెటిఆర్ వారితో పేర్కొన్నారు. 21 వేల మంది విఆర్‌ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి మానవీయతను చాటుకుందని, అలాగే ఆర్టీసి ఉద్యోగులను ప్రభుత్వ పరిధిలోకి తీసుకొచ్చి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిందని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని బస్సు డిపోల ఎదుట ఆర్టీసీ కార్మికులతో కలిసి సంబురాలు నిర్వహించాలని పార్టీ నాయకులను కెటిఆర్ కోరారు. దీంతోపాటు ఒకటి, రెండురోజుల్లో విఆర్‌ఏల కుటుంబాలతోనూ, ఆర్టీసి కార్మికుల కుటుంబాలతోను ప్రత్యేకంగా ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని ఎమ్మెల్యేలకు, నియోజకవర్గ ఇన్‌చార్జీలకు కెటిఆర్ సూచించారు.అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న అనాథలను ఒక పాలసీ కిందకు తీసుకువచ్చి, వారి బాధ్యతలను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే తీసుకునేలా చేసిన నిర్ణయం కూడా అత్యంత మానవీయమైన పరిపాలనా నిర్ణయమని ఈ సందర్భంగా కెటిఆర్ అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర రాజధానిలో 70 కిలోమీటర్లు ఉన్న మెట్రోను 415 కిలోమీటర్లకు విస్తరించేలా భారీ ప్రణాళికను ప్రకటిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎక్కడికక్కడ బిఆర్‌ఎస్ పార్టీ ప్రజల్లోకి తీసుకువెళ్లాలని మంత్రి సూచించారు. మెట్రో సేవలు అందుబాటులోకి రానున్న నియోజకవర్గాల్లో స్థానిక పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించాలని ఆయన సూచించారు.మెట్రో విస్తరణతో హైదరాబాద్ ప్రజా రవాణా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని, దాంతో నగర విస్తరణ వేగంగా జరుగుతుందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి కెటిఆర్ చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల వలన ఇబ్బందుల పాలైన ప్రజలకు ఉపశమనం అందించేలా రాష్ట్ర ప్రభుత్వం తక్షణ సాయంగా రూ.500 కోట్లు ప్రకటించిందని, ఇవి ప్రజలకు ఉపయుక్తంగా ఉంటాయని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఎక్కడికక్కడ జిల్లా కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి సూచించారు.

KTR

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News