Monday, April 29, 2024

బతికి ఉండగానే పసికందును పాతిపెడుతుండగా….

- Advertisement -
- Advertisement -

Live baby funeral in Vizag

విశాఖపట్నం: బతికి ఉండగానే పసికందును పాతిపెడుతుండగా శ్మశాల వాటిక సిబ్బంది అడగడంతో అక్కడి నుంచి నలుగురు వ్యక్తులు పారిపోయిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలోని జ్ఞానాపురంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. నలుగురు వ్యక్తులు కవర్‌లో పసికందును విశాఖపట్నంలోని కాన్వెంట్ జంక్షన్‌లోని హిందూ శ్మశాన వాటికలో తీసుకొచ్చారు. శ్మశాన వాటిక సిబ్బంది శిశువును తీసుకొని పాతిపెడుతుండగా కవర్‌ను విప్పడంతో పసికందు ఏడవటం మొదలుపెట్టింది. బతికి ఉండగానే ఎందుకు ఖననం చేస్తున్నారని వారినిప్రశ్నించిడంతో వారు ఘటనా స్థలం నుంచి వెళ్లిపోయారు. ఈ శిశువును స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ వాళ్లు గొడవ పెట్టుకున్నారు. శ్మశాన వాటిక సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఐసియులో ఆ శిశువు చికిత్స పొందుతున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News