Saturday, April 27, 2024

కూతురుతో సరదాగా మహేష్

- Advertisement -
- Advertisement -

Mahesh babu

 

కరోనా వ్యాప్తిని అరికట్టే పనిలో భాగుంగా కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు లాక్ డౌన్ కొనసాగిస్తున్నాయి. ఇక సెలెబ్రిటీలు సామాజిక బాధ్యతగా ఇంటికే పరిమితం అవుతున్నారు ఎక్కువగా తన సినిమాల షూటింగ్స్ లేనపుడు ఖాళీ సమయంలో ఇంట్లో పిల్లలతో సరదాగా గడుపుతుంటానని మహేష్ బాబు స్వయంగా పలుమార్లు చెప్పడం జరిగింది. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్లో ఫ్యామిలీతో గడుపుతున్న మహేష్, ఎక్కువగా పుస్తకాలు చదవడం, సినిమాలు చూడడం, అలానే పిల్లలిద్దరితో కలిసి సరదాగా గడపడం చేస్తున్నారని ఇటీవల ఆయన సతీమణి నమ్రత ఒక పత్రికా ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. కూతురు సితారతో కలిసి సరదాగా గడుపుతున్న ఒక ఫోటోని తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసారు. ఈ విపత్కర పరిస్థితిని సమష్టిగా ఎదుర్కోవాలనీ, అందరూ ఇళ్లల్లోనే సురక్షితంగా ఉండాలనీ ఆయన విజ్ఞప్తి చేశారు.

 

Mahesh babu spend his time with family
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News