Monday, April 29, 2024

రేవంత్ రెడ్డి సవాల్‌ను స్వీకరించు: మల్లారెడ్డి

- Advertisement -
- Advertisement -

 

Malla reddy comments on Revanth Reddy

 

హైదరాబాద్: తాను ఎంపి అయినప్పటి నుంచి టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని మంత్రి మల్లారెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. తాను విసిరిన సవాల్‌కు రేవంత్ రెడ్డి నుంచి సమాధానం లేదని ఎద్దేవా చేశారు. ఏవో పేపర్లు చూపించి పెద్ద మనిషి మీద బురద జల్లితే చెల్లుతుందా? అని ప్రశ్నించారు. జవహర్ నగర్‌లో పేదలు ఇళ్లు కట్టుకున్న ప్రభుత్వ స్థలాలకు పట్టాలు ఇచ్చిన ఘనత సిఎం కెసిఆర్‌కు దక్కుతుందని మల్లారెడ్డి ప్రశసించారు. రెండున్నర లక్షల జనాభా ఉన్న జవహర్ నగర్ కార్పొరేషన్‌లో ఆస్పత్రి కట్టి ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ఆస్పత్రి కోసం తీసుకున్న స్థలానికి ప్రభుత్వం ఎన్‌ఒసి ఇచ్చిందన్నారు. జవహర్‌నగర్‌లో మొత్తం ప్రభుత్వ భూములే ఉన్నాయని, ప్రైవేట్ భూములు లేవన్నారు. తాను అమాయకుడినని, రాజకీయాలు తనకు తెలియదన్నారు. తన కాలేజీలు మూసివేస్తారని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, అన్ని అనుమతులతోనే ఆస్పత్రి నిర్మించానన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News