Monday, April 29, 2024

కోర్టు ఆవరణలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నాంపల్లి కోర్టు భవనంపై నుంచి బుధవారం దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆ యువకుడిని మెహదీపట్నం సమీపంలోని ఫస్ట్ లాన్సర్‌లో నివాసముంటున్న మహ్మద్ సలీముద్దీన్‌గా గుర్తించారు. గంజాయి కేసులో సలీముద్దీన్‌ నిందితుడు. బుధవారం ఆయన కోర్టుకు హాజరయ్యారు. దీంతో ఒక్కసారిగా సలీముద్దీన్‌ కోర్టు భవనంలోని మూడో అంతస్తుకు చేరుకుని అక్కడి నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడిని పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సలీముద్దీన్‌ ఈ దారుణానికి ఒడిగట్టడానికి గల అసలు కారణాన్ని పోలీసులు ఆరా తీస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News