- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. మరో ఐదు రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడు రోడ్డు ప్రమాదంలో మరణించిన సంఘటన రాష్ట్రంలోని అనంతపురం జిల్లా కదిరి మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని ఎర్రదొడ్డి గ్రామానికి చెందిన మహేశ్(26) వివాహం ఆగస్టు 27న జరగాల్సి ఉంది. ఈ క్రమంలో పెళ్లికి మరో ఐదు రోజులు మాత్రమే ఉండడంతో మరికొంతమంది బంధువులకు మహేశ్ స్వయంగా పెండ్లి పత్రికలు పంచేందుకు సోమవారం ఉదయం బైక్పై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో మహేశ్ ఘటనాస్థలంలోనే మరణించారు. దీంతో మహేశ్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Man died in Road Accident in Anantapur
- Advertisement -