Monday, April 29, 2024

బహదూర్‌పల్లిలో రోడ్డు ప్రమాదం: ఒకరు మృతి, నలుగురికి తీవ్ర గాయాలు

- Advertisement -
- Advertisement -

 

Man killed in Road Accident in Bahadurpally

హైదరాబాద్: నగర శివార్లలోని బహదూర్‌పల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి బహదూర్‌పల్లి సమీపంలోని మైసమ్మ గూడ వద్ద వేగంగా వచ్చిన ఓ కారు అదుపుతప్పి చెట్టుకు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. బాధితులంతా బహదూర్‌పల్లికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Man killed in Road Accident in Bahadurpally

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News