Monday, April 29, 2024

గోనె సంచిలో మహిళా మృతదేహం…. బాయ్ ప్రెండే చంపి

- Advertisement -
- Advertisement -

Man thrashed to death by woman

లక్నో: గోనె సంచిలో మహిళా మృతదేహం కనిపించిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం గజియాబాద్ ప్రాంతం లోనిబార్డర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఓ మహిళా అనే తన భర్తతో విడాకులు తీసుకొని లోని బార్డర్‌లో ఒంటరిగా ఉంటుంది. ఆమె తన బాయ్ ఫ్రెండ్‌తో వివాహేతర సంబంధం పెట్టుకొని పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. తన ప్రియురాలి మరో వ్యక్తితో చనువుగా ఉంటుందని అనుమానం కలిగింది. తన ప్రియురాలిని చంపేసి అనంతరం గోనె సంచిలో మృతదేహాన్ని మూటకట్టి నిర్మానుష్య ప్రదేశంలో పడేశాడు. స్థానికులు గోనె సంచిలో మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేయగా లవరే ఆమెను చంపాడని పోలీసులు నిర్ణయానికి వచ్చారు. అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News