Monday, April 29, 2024

తల్లి మందలించింద‌ని నిప్పంటించుకున్న కొడుకు

- Advertisement -
- Advertisement -

Man Sets Himself on Fire At Chandanagar

హైదరాబాద్: తల్లి మందలించడంతో ఓ కుమారుడు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నల్లగండ్లలో చోటుచేసుకుంది. ఒంటిపై పెట్రోల్ పోసుకొని సంతోష్ కుమార్ (18)ఆత్మహత్య చేసుకున్నాడు. డిప్లమా కోర్సు చదువు మధ్యలోనే ఆపేసి, ఏం పని చేయకుండా తిరుగుతుండడంతో తల్లి సంతోష్ ను మందలించింది. దీంతో మనస్తాపం చెందిన అతను ఇంట్లో ఎవరికీ చెప్పకుండా శుక్రవారం ఉదయం వెళ్లిపోయాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు నిన్న ఉదయం చందానగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సంతోష్ కుమార్ పై మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు మొబైల్ లొకేషన్ ఆధారంగా నల్లగండ్ల హుడా లేఔట్ లో ఆచూకీ కనుగొన్నారు. అప్పటికే సంతోష్ మృతదేహం పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News