సిద్దిపేట: మాయ మాటలు చెప్పే కాంగ్రెస్, బిజెపిల మాటలు నమ్మవద్దని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. దుబ్బాక నియోజకవర్గంలోని తిమ్మాపూర్ రాయపోల్, ఆనాజీపూర్ గ్రామాలకు చెందిన వందలాది మంది యువకులు మంత్రి హరీశ్రావు సమక్షంలో టిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా యువతను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. టిఆర్ఎస్పై ఉన్న నమ్మకంతోనే ఇతర పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పార్టీలో చేరుతున్నారని అన్నారు.
జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడానికి సొంత డబ్బులతో శిక్షణ అందించి జాబ్ మేళా నిర్వహించిఉద్యోగాలు కల్పించామన్నారు. ఉద్యోగ అవకాశాలు రావడంతో యువకులు సైతం ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. ఓట్ల కోసమే వచ్చే నాయకులను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. పార్టీ కోసం యువత సైనికుల్లా పనిచేయాలన్నారు. పార్టీని నమ్ముకున్న వారిని అన్ని విధాలుగా అండగా నిలుస్తామన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య యువకులు వారధిగా పనిచేయాలన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో బిజెపి, కాంగ్రెస్ ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు ఓటు ద్వారా తగిన బుద్ది చెప్పాలన్నారు. 99 శాతం ప్రజానీకమంతా టిఆర్ఎస్ వైపే ఉందన్నారు.
Minister Harish Rao Election Campaign At Dubbaka