- Advertisement -
న్యూఢిల్లీ : భారత పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవార్ధం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మంగళవారం రాత్రి ఇచ్చే విందుకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాజ్యసభలో విపక్ష నేత గులాంనబీ ఆజాద్ హాజరుకావడం లేదు. ఈ మేరకు సోమవారంనాడు సాయంత్రం ఇద్దరు నేతలు వేర్వేరుగా ప్రకటన చేయడంతో పాటు రాష్ట్రపతి భవన్కు సమాచారమిచ్చారు. అగ్రదేశాధినేత పర్యటన సందర్భంగా రాష్ట్రపతి విందును బహిష్కరించాలని లోక్సభలో విపక్ష నేత అధీర్ రంజన్ చౌధరి ఇప్పటికే నిర్ణయించుకున్నారు. యుపిఎ చైర్పర్సన్ సోనియా గాంధీని ఈ విందుకు ఆహ్వానించకపోవడంపై కాంగ్రెస్ నేతలు కినుక వహించారు. విపక్షాలకు చెందిన సీనియర్ నేతలను ఆహ్వానించే ఆనవాయితీని పక్కనపెట్టడమేంటని ప్రతిపక్ష నేతలు దుయ్యబట్టారు.
Manmohan Singh Azad absent for Trump dinner
- Advertisement -