Monday, April 29, 2024

పలువురు ఐపిఎస్‌లకు పోస్టింగ్

- Advertisement -
- Advertisement -

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు స్థాన చలనం

మనతెలంగాణ/ హైదరాబాద్ : కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. ఫిర్యాదులు వస్తే చాలు.. ఏ మాత్రం అలక్ష్యం చేయకుండా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే.. పలు రాజకీయ పార్టీలు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ ఓఎస్డీ రాధాకృష్ణ రావుపై ఫిర్యాదు చేశాయి. ఆయన వ్యవహార శైలిని ప్రశ్నించాయి. రిటైర్ అయిన తర్వాత కూడా.. స్పెషల్ ఆన్ డ్యూటీ కింది.. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ ఓఎస్డీగా బిఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్ణయించటాన్ని సవాల్ చేశాయి. రాజకీయ పార్టీలు. అదే విధంగా పలువురు పోలీస్ అధికారులపైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశాయి ఆయా రాజకీయ పార్టీలు. ఈ క్రమంలో ఇసి ఆదేశాలతో పలువురు పోలీసు ఉన్నాతాధికారులను బదిలీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో కొంతమందిని హైదరాబాద్ పోలీస్ అకాడమీకి అటాచ్ చేశారు.

పలువురు ఐపిఎస్ అధికారులకు పోస్టింగ్…‘టీఎస్పీఏ జాయింట్ డైరెక్టర్‌గా రంగనాథ్, టీఎస్పీఏ డిప్యూటీ డైరెక్టర్‌గా రాజేంద్ర ప్రసాద్, సిఐడి ఎస్పీగా శ్రీనివాస్ రెడ్డి, గ్రే హౌండ్స్ ఎస్పీగా వెంకటేశ్వర్లు, సౌత్ వెస్ట్ జోన్ డిసిపిగా నితికా పంత్, సౌత్ ఈస్ట్ జోన్ డిసిపిగా రోహిత్ రాజ్, ట్రాఫిక్ డిసిపిగా ఆర్.వెంకటేశ్వర్లు, పెద్దపల్లి డిసిపిగా సునీతా మోహన్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News