Saturday, April 27, 2024

విష్ యూ హ్యాపీ న్యూఇయర్: మంత్రి హరీశ్

- Advertisement -
- Advertisement -

Minister Harish Rao Says New Year Greetings to People

సిద్దిపేట: తెలంగాణ ప్రజలకు ఆంగ్ల నూతన సంవత్సర సందర్భంగా మంత్రి హరీశ్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో సరికొత్త ఆలోచనలు, ఆశయాలు, లక్ష్యాలతో ముందుకు సాగాలని ఆక్షాంక్షించారు. సిఎం కెసిఆర్ నాయకత్వంలో 2020లో రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగతి సాధించిందని తెలిపారు. ఈ ఏడాది అదే స్ఫూర్తితో సిద్దిపేట జిల్లాను పురోభివృద్ధి సాధించి ఆదర్శంగా నిలుపుతామని అన్నారు. గత ఏడాది కరోనా మహమ్మారితో చాలా ఇబ్బందులు పడ్డామని ఆ సమస్యల నుంచి తేరుకుని ఈ ఏడాది అందరి కుటుంబాల్లో సుఖశాంతులు విలసిల్లాలని కోరారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత నూతన లక్ష్యాలతో ప్రణాళికలు సిద్ధం చేసుకుని విజయం సాధించాలని కోరారు. 2021లో ప్రజలందరికీ శుభం కలగాలని కోరుతూ.. హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News