Monday, April 29, 2024

‘న’మ్మించి ‘మో’సం

- Advertisement -
- Advertisement -

Minister KTR's open letter to Prime Minister Narendra Modi

‘నమో’కు కొత్త నిర్వచనం

రోజ్ గార్ ఓ బేకర్ పథకం నిరుద్యోగ యువతతో నరేంద్రుడి
ఆటలు గుజరాత్, హిమాచల్ ఎన్నికల ముందట కొత్త డ్రామా
మేము 2.50 లక్షలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశాం 130 కోట్ల
జనాభా ఉన్న దేశంలో మీరెన్ని ఉద్యోగాలు నింపారు? ఉద్యోగ
నియామకాలపై శ్వేతపత్రం విడుదల చేయగలరా?
ప్రధాని నరేంద్ర మోడీకి మంత్రి కెటిఆర్ బహిరంగ లేఖ

మన తెలంగాణ/హైదరాబాద్ : ‘రోజ్ గార్’ మేళా పేరుతో తాజాగా 10 లక్షల ఉద్యోగాల రిక్రూట్‌మెంట్ అంటూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ, నిరుద్యోగ యువతీ యువకులను మరోసారి మభ్యపెట్టేందుకు మరో కొత్త నాటకానికి తెరలేపారని టిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అరోపించారు. ఈ నేపథ్యంలో నిరుద్యోగ యువత జీవితాలతో పరిహాస మాడడం మాని చిత్తశుద్ధితో, దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని వెంటనే చేపట్టాలని ప్రధానిని డిమాం డ్ చేశారు. హిమాచల్, గుజరాత్ ఎన్నికల ముంద ర మోడీ ఆడుతున్న మరో కొత్త డ్రామా ఇది అని విమర్శించారు. ఈమేరకు ప్రధాని మోడీకి మంగళవారం ఘాటైన బహిరంగ లేఖను రాశారు. మీరు చేపట్టిన ‘రోజ్ గార్’ మేళాతో దేశ యువత సం తోషం ఎక్కువ రోజులు ఉండేది కాదని అర్థమైందని, ఎందుకంటే, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలను నింపుతామని ప్రకటించిన మీ మాటలు న మ్మి నాటి నుంచి నేటి వరకు మీ ఎనిమిదేండ్ల పాలనలో 16 కోట్ల ఉద్యోగాల కోసం నిరుద్యోగ యువ త ఆశతో ఎదురు చూస్తున్న పరిస్థితి నేడు దేశవ్యాప్తంగా నెలకొందని, ఇట్లా ఏటేటా పెరుగుతున్న నిరుద్యోగుల ఆశలతో మరోసారి రోజ్ గార్ మేళా పేరుతో మీరు ఆటలాడడం ఏమాత్రం సరైన చర్య కాదన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి? అని ప్రశ్నించారు.

ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల భర్తీ అని చెప్పిన మీరు, ఇప్పుడు ఆ సంఖ్యను 10 లక్షలకు కుదించడంలో ఆంతర్యమేమిటి? అని నిలదీశారు. అంతటితో ఆగకుండా కేవలం 75 వేల మందికి మాత్రమే నియామక పత్రాల అందజేసి, అర్థ్ధిక వ్యవస్థ అనేక కష్టాలల్లో ఉందంటూ మీరు చేసిన వ్యాఖ్యలు, ఈ రోజ్ గార్ హామీ మీద కూడా అనుమానాలు రేకెత్తిస్తున్నాయన్నారు. అయితే కేవలం మీ పరిపాలన వైఫల్యం అడ్డగొలు అర్థ్ధిక విధానాల వలనే దేశ అర్ధిక వ్యవస్థ నేల చూపులు చూస్తున్నదనే విషయం మీకు గుర్తు చేస్తున్నానని తెలిపారు. కోట్ల ఉద్యోగాలు హామీ ఇచ్చి, కేవలం వేల ఉద్యోగాలతో మీరు చేస్తున్న మీడియా ప్రచార పటోపం, పదే పదే నిరుద్యోగ యువతతో పరిహాసం అడుతున్నట్లు ఉన్నదని విమర్శించారు. ఇది కేవలం మీరు, మీ బిజెపి పార్టీ ప్రభుత్వం నిత్యం ప్రదర్శించే ఆర్భాటపు ప్రచారమే తప్పిస్తే మరోటి కాదని మరోసారి ప్రజలకు అర్థమైందన్నారు. ఇటువంటి ఆర్భాటపు ప్రచార కార్యక్రమాన్ని నిరుద్యోగ యువతమీద రుద్దే ప్రయత్నం చేయడం దారుణం అనే విషయాన్ని నేను మీకు స్పష్టం చేయదలిచానని పేర్కొన్నారు.

ఇదే నిరుద్యోగుల భర్తీ విషయం మీద, దేశవ్యాప్తంగా ఉన్న ఖాళీలను నింపాలని, యువతకు ఉపాధి అవకాశాలను కల్పించాలని 9 జూన్ 2022 నాడు నేను మీకో బహిరంగ లేఖను రాసిన, దానికి మీనుంచి ఎలాంటి సమాధానం లేదని గుర్తు చేశారు. రోజ్ గార్ మేళా పేరుతో కబేళాలో బలి పశువుల మాదిరి నిరుద్యోగ యువతను మరోసారి మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. మీరు ఇస్తామన్నా రెండు కోట్ల ఉద్యోగాలా హమీ మేరకు ఇప్పటిదాకా 16 కోట్ల ఉద్యోగాలు కల్పించాల్సి ఉంది.. కానీ, మీరు చేస్తున్న ఈ రోజ్ గార్ మోసంతో ‘భాత్ కరోడోమే.. కామ్ పకోడోమే’ అన్న తీరుగా మారిందని ఎద్దేవా చేశారు. మీరిలా పదే పదే ఉద్యోగాల విషయంలో యువతను మోసం చేస్తూ మభ్యపెడుతున్న తీరుతో ‘నమో అంటే నమ్మించి మోసం చేసేవాడు’ అని రుజువు అయిందని ఘాటుగా విమర్శించారు. ప్రతి ఎన్నికల ముందు యువతను మోసపుచ్చే ఇలాంటి ప్రచార కార్యక్రమాలను పక్కన పెట్టి నిబద్దతతో నిరుద్యోగ సమస్యపైన దృష్టి సారించాలని సూచించారు. మీ బిజెపి ప్రభుత్వ హయాంలో నేటివరకు మీరు భర్తీ చేసిన ఉద్యోగాలెన్నో శ్వేత పత్రం విడుదల చేయగలరా? అని ప్రశ్నించారు.

తెలంగాణ ఒక రాష్ట్రంగా 2,24,000 ప్రభుత్వ ఉద్యోగాలు, సూమారు 16.5 లక్షల ఉద్యోగ, ఉపాదిఅవకాశాలను ప్రయివేట్ రంగంలో కల్పిస్తున్నప్పుడు, ఒక కేంద్ర ప్రభుత్వంగా మీరు దేశ వ్యాప్తంగా ఎన్ని ఉద్యోగాలివ్వాల్సి ఉందని ఆయన ఘాటుగా విమర్శనాస్త్రాలు సంధించారు. ఏటా 50 వేల ఉద్యోగాలను కూడా సరిగ్గా భర్తీ చేయని మీరు, రోజ్ గార్ మేళా పేరుతో కేవలం 75 వేల మందికి నియామక పత్రాల అందచేయడాన్ని దేశ నిరుద్యోగులు గమనిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతిసారి మాదిరే ఈసారి కూడా యువతను ఉద్యోగాల పేరుతో మోసం చేస్తే మీ పాలనపైన, ప్రభుత్వంపైన తిరగబడే రోజు త్వరలోనే వస్తుందని మంత్రి కెటిఆర్ హెచ్చరించారు. మూడున్నర కోట్ల జనాభా ఉన్న తెలంగాణలో ఎనిమిదేండ్లల్లో సూమారు 1 లక్షా 50 వేల ఉద్యోగాలను భర్తీ చేసినమన్నారు. మరో 91 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేసే ప్రక్రియ ప్రారంభించినమని పేర్కొన్నారు. అంటే ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే దాదాపు 2,50,000 ఉద్యోగాలకు పైగా భర్తీ చేస్తున్నపుడు, 130 కోట్ల దేశ జనాభాలో మీరు నింపిన ఉద్యోగాలెన్ని? దాని శాతమెంత ? అని ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వం తన పరిపాలనలో ఉన్న దేశంలోని 28 రాష్ట్రాల్లో ఎన్ని ఉద్యోగాలివ్వాల్సి ఉంటదో.. మీరే చెప్పాలి? అని సదరు లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం తనవంతుగా నిర్వహిస్తున్న బాధ్యతలో కేంద్రం నిర్వహిస్తున్న బాధ్యత చాలా చిన్నదని గణాంకాలే చెబుతున్నాయని, లెక్కలేస్తే మీ అసలు రంగు బయటపడుతుందని ఎద్దేవా చేశారు. మీరు చేపట్టిన ప్రభుత్వ రంగ సంస్ధల అమ్మకాల పందేరం వలన సూమారు రెండున్నర లక్షల మంది ఇప్పటికే రెగ్యులర్ ఉద్యోగాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్ధలో సూమారు 50 శాతం ఉన్న రిజర్వుడ్ కేటగిరిలకు చెందిన వారికి భవిష్యత్తులోనూ శాశ్వతంగా ఉద్యోగావకాశాలు దొరక కుండా పోతున్నాయన్నారు. లక్షలాది మందికి ఉపాధిని కల్పిస్తూ లాభాలతో నడుస్తున్న ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ, కార్పొరేట్లకు కట్టబెడుతున్నది మీ ప్రభుత్వమేనని దుయ్యబట్టారు. ఒక వైపు ఉద్యోగాలను తొలగిస్తూ నేడు తిరిగి ఉద్యోగ మేళా అంటే నిరుద్యోగులను ‘నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించడం’ కాదా? అని ప్రశ్నించారు.

2014 నంచి 2022 ఎనిమిది ఏండ్లలో జూన్ 2022 నాటికి కేంద్రం భర్తీ చేసిన ఉద్యోగాల సంఖ్య కేవలం 7లక్షలు మాత్రమే..ఇంకా భర్తీ చేయాల్సిన ఉద్యోగాలు సూమారు 16 లక్షలున్నాయని మీ ప్రభుత్వమే చెప్పిందన్నారు. ఈ నేపథ్యంలో మీరు రోజ్ గార్ మేళా ద్వారా కేవలం 75 వేల మందికి నియామక పత్రాలు అందించడం ద్వారా నిరుద్యోగులను మీరేం చేయదలుచుకున్నారు ? అని ప్రశ్నించారు. రోజ్ గార్ మేళా ప్రకటన సందర్భంగా 38 కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు డిపార్ట్ మెంటుల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నట్టుగా మీరు ప్రకటించారని, అయితే 38 శాఖల్లో మొత్తం ఇంకా ఎన్ని ఖాళీలున్నాయో.. వాటిని ఎప్పటివరకు భర్తీ చేస్తారో స్పష్టం చేయగలరా? నిరుద్యోగుల కోసం జాతీయ జాబ్ కాలెండర్ ను మీరు విడుదల చేయగలరా ? అని సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వంలో ఉన్న 8 ఏండ్ల కాలంలో ఉద్యోగాలను భర్తీ చేయని మీరు, మీ పదవీ కాలం ముగుస్తున్న సంవత్సరంన్నర కాలం ముందు తీరా ఎన్నికల రోజ్ గార్ మేళా పేరుతో తూతూ మంత్రపు వ్యవహారాలను నడపడాన్ని నిరుద్యోగుల తల్లిదండ్రులైన దేశ ప్రజలు గమనించడం లేదనుకుంటున్నారా.?

దీనికి మీ సమాధానం ఏమిటి ?అని అన్నారు. మీ రోజ్ గార్ కార్యక్రమం సముద్రంలో నీటి బొట్టు మాదిరి ఉన్నదని విమర్శించారు. ఇప్పటికైన ప్రతి ఎన్నికల ముందు ప్రజలను మోసపుచ్చే ఇలాంటి ప్రచార కార్యక్రమాలను పక్కన పెట్టి నిబద్దతతో నిరుద్యోగ సమస్యపైన దృష్టి సారించాలని సూచించారు. ఇచ్చిన హమీ మేరకు భారీగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. కేవలం మీడియా హెడ్ లైన్లు, పత్రికల్లో ప్రచారం కోసం కాకుండా నిరుద్యోగ యువతకు అవకాశం ఇచ్చేలా కేంద్రంలోని అన్ని శాఖల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిసారి మాదిరే ఈసారి కూడా యువతను ఉద్యోగాల విషయంలో మోసం చేస్తే మీపాలనపైన, ప్రభుత్వంపైన తిరగబడే రోజు త్వరలోనే వస్తుందన్న విషయాన్ని గుర్తిస్తే మంచిదని మంత్రి కెటిఆర్ పునరుద్ఘాటించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News