Monday, April 29, 2024

ఫలహారబండి వేడుకల్లో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఆశాఢ మాసం బోనాల పండుగ ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు నిర్వహించిన ఫలహార బండి ఊరేగింపు కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పనశాఖ మంత్రి చేమకూర మల్లారెడ్డి పాల్గొన్నారు. సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలోని ఏడుగుళ్ల దుర్గామాత ఆలయాన్ని ఆయన సందర్శించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ఆశాఢమాస బోనాల జాతరను ప్రజలు అత్యంత భక్తిశ్రద్దలతో నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ నాయకులు టింకుగౌడ్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News