Monday, April 29, 2024

రానున్న రోజుల్లో చేపల ఎగుమతి

- Advertisement -
- Advertisement -

Minister Talasani says Exporting of fish in coming days

 

ఆధునాతన పద్ధతులలో చేపల పెంపకం, మార్కెటింగ్‌పై ఎంపిఇడిఎతో ఎంఒయూ

చేపల ప్రాసెసింగ్ యూనిట్లు కూడా ఏర్పాటు చేస్తాం

సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ ప్రాంతీయ కార్యాలయ ప్రారంభోత్సవంలో మంత్రి తలసాని

మన తెలంగాణ/హైదరాబాద్ : రానున్న రోజుల్లో రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలు, దేశాలకు చేపలను ఎగుమతి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలను చేపడుతుందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మాసాబ్ ట్యాంక్‌లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (ఎంపిఇడిఎ) ప్రాంతీయ కార్యాలయాన్ని ఆయన ఛైర్మెన్ శ్రీనివాస్ పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనితా రాజేంద్రలతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఆ తరువాత మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత మత్స్యకారులు సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ, అభివృద్ధి చర్యలను చేపట్టిందన్నారు. రాష్ట్రంలో 5.72 లక్షల హెక్టార్ల నీటి విస్తీర్ణంతో కర్నాటక, తమిళనాడు తరువాత తెలంగాణ మూడోస్థానంలో ఉందన్నారు. 2019-20 సంవత్సరంలో 3.10 లక్షల టన్నుల చేపల ఉత్పత్తితో తెలంగాణ దేశంలో 8వ స్థానంలో నిలిచిందని తెలిపారు.

రాష్ట్రంలో బొచ్చె రాహు మ్రిగాల, బంగారుతీగ, గడ్డి చేప వంటి ఐదు రకాలు మాత్రమే పెంపకం జరుగుతుందన్నారు. మత్సకారులు అధిక ఆదాయం పొందేందుకు ఎగుమతులకు ఎంతో డిమాండ్ ఉన్న తిలపియా, మంచినీటి రొయ్యల పెంపకం చేపట్టే విధంగా ప్రభుత్వం ప్రోత్సాహిస్తుందని వివరించారు. రాష్ట్రంలో ఆధునిక పద్ధతులలో చేపల పెంపకం, మార్కెటింగ్ సౌకర్యాల విస్తరణ మత్సకారులకు అవసరమైన శిక్షణ కార్యక్రమాల నిర్వహణ కోసం ఎంపిఇడిఎతో ఎంఒయూ కుదుర్చుకున్నట్లు చెప్పారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో ప్రాసెసింగ్ యూనిట్లు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజలకు చేపలను అందుబాటులోకి తీసుకెళ్లేందుకు జిహెచ్‌ఎంసి పరిధిలో 150 డివిజన్‌లలో ఒకటి చొప్పున మొబైల్ చేపల విక్రయ కేంద్రాలను ప్రారంభిస్తామన్నారు. ఈ విక్రయ కేంద్రాలలో చేపలతో పాటు చేపల వంటకాలు విక్రయించేలా డిజైన్ చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ లకా్ష్మరెడ్డి, అగ్రోస్ మేనేజింగ్ డైరెక్టర్ రాములు, మత్స్యశాఖ డిప్యూటి డైరెక్టర్లు శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News