Monday, April 29, 2024

ఈటలవి దొంగ ఏడుపులు: మంత్రి తలసాని

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మాజీ మంత్రి ఈటెల రాజేందర్ వి అంతా దొంగ ఏడుపులని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. సోమవారం మీడియా సమావేశంలో తలసాని మాట్లాడుతూ ఈటలను తీవ్రంగా విమర్శించారు. బిజెపి కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చిందని మాట్లాడిన ఈటెల అదే పార్టీలో చేరడంలో ఆంతర్యం ఏమిటి ప్రశ్నించారు. 45ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. బిజెపి, కాంగ్రెస్ రెండు పార్టీలు పూటకో మాట మాట్లాడుతున్నయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా సమయంలో ప్రజలను ఆదుకున్నది తెరాస ప్రభుత్వమేనని, పేదలను ఆర్ధికంగా బలోపేతం చేసేందుకే టిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో పథకాలు అమలు చేస్తుందన్నారు.  హుజురాబాద్ లో గెల్లు శ్రీనివాస్ గెలుపు ఖాయమని మంత్రి తలసాని తేల్చి చెప్పారు.

Minister Talasani slams Etela Rajender

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News